సీనియర్ పాత్రికేయులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత " దేవిప్రియ " ఆకస్మిక మరణం తెలుగు సాహితీలోకానికి తీరని లోటు అని మాజీ మంత్రి  పరిటాల సునీత అన్నారు. ఈ సందర్భంగా దేవిప్రియ తో ఉన్న జ్ఞాపకాలను ఆమె నేమురవేసుకున్నారు. అమరుడు పరిటాల రవీంద్ర  జీవిత చరిత్ర పుస్తకానికి, " అస్తమించని రవి " అనే అజరామరమైన పేరు పెట్టిన దేవిప్రియ గారి మరణం పరిటాల అభిమానులు, శ్రేయోభిలా‌షులను తీరని వేదనకు గురి చేసింది అని పరిటాల సునీత అన్నారు.

దేవిప్రియకు నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాం అని ఆమె పేర్కొన్నారు. కాగా దేవి ప్రియ మరణానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ సిఎం వైఎస్ జగన్, తెలంగాణా సిఎం కేసీఆర్ సహా పలువురు నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: