విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ కు చేదు అనుభవం ఎదురైంది. 77 వార్డ్ అభ్యర్థి బొట్టు సన్యాసిరావు మృతదేహన్ని చూడటానికి న పెందుర్తి  ఎమ్మెల్యే అదీప్ రాజు వచ్చారు. ఆయన అక్కడికి రాగానే ఆయనకు షాక్ ఇచ్చారు సన్యాసి రావు బంధువులు. పెదగంట్యాడ మండలం 77 వ వార్డు అభ్యర్ది బొట్టు సన్యాసి రావు అనారోగ్యంతో మృతి చెందారు.

రాజకియ కారణల ఒత్తిడి కారణగానే అతను మృతి చెందాడని  కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. కాగా ఎమ్మెల్యే అధీప్ రాజ్ సిఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్తూ ఉంటారు. అతని మీద జగన్ ప్రత్యేక అభిమానం చూపిస్తారని వైసీపీ నేతలు అంటూ ఉంటారు. జగన్ ముద్దు పేరుతో పిలిచే యువ ఎమ్మెల్యే కూడా ఆయనే కావడం గమనార్హం. కాగా ఈ మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: