గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎక్కువగా కేంద్ర మంత్రుల సహకారం తీసుకుని హైదరాబాద్ లో ప్రచారం చేయించాలి అని భావించడం గమనార్హం. రాజకీయంగా ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. హైదరాబాద్ లో ప్రచారానికి కేంద్ర మంత్రి  ప్రకాష్ జవదేకర్ వస్తున్నారు. నేడు హైదరాబాద్‌ కు కేంద్రమంత్రి ప్రకాష్ జావడేకర్ రానున్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని హామీలపై 12.30 గంటలకు తాజ్ డెక్కన్ హోటల్లో ఛార్జ్ షీట్ విడుదల చేస్తారు ఆయన. హైద్రాబాద్ అభివృద్ధిపై టీఆర్ఎస్ ప్రగతి నివేదికలో గ్రాఫిక్స్ మాత్రమే ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని జూబ్లీహిల్స్  డివిజన్ లోని సాయంత్రం ఇంటింటికి ఛార్జ్ షీట్ పత్రాలు పంపిణీ  చేయనున్న జావడేకర్... ఈ సందర్భంగా ప్రసంగించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: