తిరుపతి ఉప ఎన్నికల్లో సిపిఐ పోటీ చేయడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రకటన చేసారు. మోడీకి జగన్ భజనపరుడు అని ఆయన మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కేంద్రాన్ని జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదు..? అని నిలదీశారు. మోడీని కాకాపట్టడంలో జగన్ దిట్ట అని ఆయన విమర్శించారు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా  సిఎంలో మార్పు రాదా..? అని ప్రశ్నించారు.

పోలవరంలోకి కమ్యూనిస్టులను  అనుమతించండి అని డిమాండ్ చేసారు. పోలవరంకు వెళుతున్న వారిని ఎందుకు నిర్భంధిస్తున్నారు అని ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఓడి గెలిచింది అన్నారు. గెలుపు కోసం మోడీ ఎంతటికైనా దిగజారుతున్నాడు అని మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ ధ్వంసమయ్యే విధంగా ప్రధాని నిర్ణయాలు ఉన్నాయి అన్నారు. కార్పొరేట్ కంపెనీల కోసమే మోడీ ప్రధానిగా పనిచేస్తున్నారా..? అని నిలదీశారు. తెలంగాణ ప్రజలను కెసిఆర్, కెటిఆర్ లు ఇంకా ఎన్నిసార్లు  మోసం చేస్తుంటారు అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: