పోలీసులు ఈ మధ్య కాలంలో అనవసర విషయాల మీద ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. తమకు సంబంధం లేని అంశాల మీద, అవినీతి వ్యవహారాల్లో ఎక్కువగా పోలీసులు ఉండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. కామారెడ్డిలో మూడవ రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. డిఎస్పీ కార్యాలయంలో నిన్న సాయంత్రం నుంచి నిరంతరంగా కొనసాగుతున్న ఏసీబీ విచారణతో పోలీసుల్లో ఆందోళన మొదలయింది.

పలు అంశాలపై డిఎస్పీని విచారిస్తున్న ఏసీబీ అధికారులు... పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. డిఎస్పీ కార్యాలయంలో ఏసీబీ సోదాలతో ఆందోళనకు గురవుతున్న పోలీసు అధికారులు.. లాబియింగ్ కి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఏసీబీ అధికారులు మాత్రం ప్రతీ ఒక్కటి ఆరా తీస్తుంది. క్రికెట్ బెట్టింగ్ లో సి ఐ హస్తం ఉందని గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: