టిడిపి ఎంపిటిసి అభ్యర్ధి భర్తపై హత్యాయత్నాన్ని చంద్రబాబు ఖండించారు. ఫోన్ చేసి బాధితులను పరామర్శించారు ఆయన. టిడిపి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు ఆయన. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల టిడిపి ఎంపిటిసి అభ్యర్ధి రాఘవమ్మ భర్త కృష్ణయ్య యాదవ్ పై, మరియు వీరాస్వామి యాదవ్ పై కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబ సభ్యులను ఆదివారం ఫోన్ చేసి  చంద్రబాబు మాట్లాడారు. అన్ని విధాలుగా కూడా  తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు.  తీవ్ర గాయాల పాలైన కృష్ణయ్య, వీరాస్వామిలకు అత్యున్నత వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను ఆయన కోరారు. ఇక ఈ ఘటనలో పోలీసుల తీరుపై కూడా తీవ్ర స్థాయిలో టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: