పెన్నా బ్యారేజ్ పనులను పర్యవేక్షించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్... కీలక వ్యాఖ్యలు చేసారు. 2007లో నెల్లూరు, సంగం పెన్నా బ్యారేజీ పనులని వైఎస్ ప్రారంభించారు అని ఆయన అన్నారు. జగన్ అధికారంలోకి రాగానే ఈ రెండు ప్రాజెక్టులని పూర్తిచేయాలని అనుకున్నారు అని వివరించారు. సముద్రానికి 100 టీఎంసీలు నీరు విడుదల చేయాల్సి రావడం వల్ల పనులు ఆలస్యం అయ్యాయని ఆయన చెప్పారు.

ఇక జనవరి నెలాఖరుకల్లా నెల్లూరు పెన్నా బ్యారేజ్ ని సీఎం చేతుల మీదగా ప్రారంభిస్తాం అన్నారు. మరో నెల సమయంలో సంగం బ్యారేజీ కూడా పూర్తిచేస్తాం అని స్పష్టం చేసారు. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిని గా  ఎవర్ని పెట్టాలా అన్నది మాపార్టీ అంతర్గత విషయం అన్నారు. మా సీఎం తీసుకున్న నిర్ణయానికి మేము అందరు కట్టుబడి ఉంటాం అని ఆయన స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: