ఏపిలో ఆరుగురు అఖిల భారత సర్వీస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎంవి. శేషగిరిబాబును ఐజి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కు బదిలీ చేసారు. సిద్దార్ధ జైన్ ను సర్వే అండ్ సెటిల్ మెంట్ కమిషనర్ గా బదిలీ  చేసారు. ఐ.ఆర్.టి.ఎస్ అధికారి కె. రవీంద్ర కుమార్ రెడ్డిని ఏపిఐఐసి వైస్ ఛైర్మన్, యండిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ఐఆర్ఎస్ అధికారి ఎం. రమణారెడ్డిని ఏపి టవర్స్ లిమిటెడ్ సిఈవో గా బదిలీ, కాన్సెప్ట్ సిటీస్ సిఈవో గా పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఐఆర్ఎస్ అధికారి సిహెచ్. రాయ్ ఈశ్వరరెడ్డి ని ఎండి ఏపి ఎడ్యుకేషన్ అండ్ వెల్ ఫేర్, ఇన్ ఫ్రా స్ర్టక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు బదిలీ  చేసారు. ఐడిఈఎస్ అధికారి సూరబాలకృష్ణ  డిఫ్యుటేషన్ పూర్తవడంతో పేరెంట్ క్యాడర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఐఆర్ఎస్ అధికారి ఎస్.బి.ఆర్. కుమార్ లక్కింశెట్టి ని ఇన్సూరేన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ గా బదిలీలు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసారు ఛీఫ్ సెక్రటరీ నీలంసాహ్ని.

మరింత సమాచారం తెలుసుకోండి: