సోషల్ మీడియాలో వైసీపీ నేతలు కాస్త దూకుడుగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వారు చేసిన వ్యాఖ్యల మీద నిన్నటి నుంచి సిబిఐ విచారణ మొదలు అయింది. ఈ నేపధ్యంలో విజయవాడ లో రెండో రోజు న్యాయమూర్తులపై అసభ్య పోస్టింగ్స్ పై సిబిఐ విచారణ జరుగుతుంది. న్యాయమూర్తులపై అసభ్య పోస్టింగ్ లపై కేసు నమోదు చేసిన సిబిఐ అధికారులు... పలువురుని విచారణకు పిలుస్తున్నారు.

నిన్న న్యాయవాది లక్ష్మీనారాయణను సి.బి.ఐ అధికారులు ప్రశ్నించారు. నేడు హైకోర్టు రిజిస్ట్రార్ ను కలిసి పోస్టింగ్లు సంబంధించి మరిన్ని డాక్యుమెంట్లు సీబీఐ అధికారులు తీసుకునే అవకాశం ఉంది. న్యాయమూర్తులను కించపరిచేలా పెట్టిన పోస్టింగ్స్ పై అలాగే... వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసిపి నాయకులు పండుల రవీంద్ర బాబు, ఆమంచి కృష్ణ మోహన్ లను ఈ రోజు విచారించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: