ఎప్పుడు వివాదాలతో సావాసం చేసే బిజెపి నేత... గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనల్లుడు రోహిత్ సింగ్ నిన్న రాత్రి 8.30 గంటలకు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. రాజాసింగ్ బావమరిది మనీష్ సింగ్ కుమారుడు అయిన రోహిత్ సింగ్ వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు అని వారి కుటుంబం తెలిపింది.

వీరి కుటుంబం కూడా రాజాసింగ్ కుటుంబంతోనే కలిసి ఉంటోంది అని చెప్పారు. ఇక ఈరోజు ఉదయం రోహిత్ అంత్యక్రియలు మొదలు కానున్నట్లు తెలుస్తుంది. మంగళ్ హాట్ లోని రాజాసింగ్ ఇంటి నుండి శీతలమాత స్మశానం వరకు అంతిమయాత్ర సాగనుందని బిజెపి గోషామహల్ ఇన్చార్జి కృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఏంటీ అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: