గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో హైదరాబాద్ కు బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య నేడు వస్తారు.  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో కలసి ఉదయం 11గంటలకు ప్యాట్నీ మహబూబ్ కాలేజీలో "చేంజ్ హైదరాబాద్" కార్యక్రమంలో పాల్గొననున్న తేజస్వీ సూర్య... ఆ తర్వాత 1 గంటలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు.

ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలసి సాయంత్రం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో చేస్తారు తేజస్వీ సూర్య. ఉదయం 9గంలకు అంబర్ పేట్ .. గోల్నాక డివిజన్ లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని కిషన్ రెడ్డి మొదలు పెడతారు. అనంతరం అంబర్ పేటలో పాదయాత్రలో కేంద్రమంత్రి పాల్గొంటారు. నేటి 10 గంటకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలో ఎంపీ ధర్మపురి అరవింద్ రోడ్ షో ఉంటుంది. డీకే అరుణ షెడ్యూల్ చూస్తే ఉదయం 9గంలకు సైదాబాద్ లో ప్రచారం చేస్తారు. 11గంలకు ముసారంబాగ్ లో చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: