83 ఏళ్ల మహిళ మృతదేహాన్ని ముంబై పోలీసులు శనివారం బాంద్రా (పడమర) లోని ఆమె ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో మహిళ మరణించిందని, ఆమె మరణం గురించి ఎవరికీ చెప్పకుండానే 53 ఏళ్ల ఆమె  కుమార్తె తన తల్లి శవంతో నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాంద్రా (పడమర)లోని చుయిమ్ గ్రామంలో ఓ మహిళ కిటికీ నుంచి చెత్త పడేస్తున్న సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

మహిళ కుమార్తె మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందనిఅందుకే కుమార్తె తన తల్లి మరణం గురించి ఎవరికీ తెలియజేయలేదని పోలీసులు భావిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం తన కుక్క చనిపోయినప్పుడు ఆ మహిళ కుమార్తె కూడా అదే పని చేసిందని స్థానిక మీడియా పేర్కొంది. మరణించిన మహిళ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి పంపినట్లు ఖార్ (వెస్ట్) పోలీస్ స్టేషన్ లో ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: