కరోనా సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు కొన్ని కొన్ని విమర్శలు అధికార పార్టీ నేతలు చేస్తున్నారు. రాజకీయంగా కూడా వారు బయటకు రాకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేసారు.

వేల కిలోమీటర్లు ఎగురుతూ వచ్చే వలస పక్షుల సందడి రాష్ట్రంలో మొదలైంది అని ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు కూడా పనుల్లో చేరేందుకు వెనక్కి తిరిగొస్తున్నారు అన్నారు. ప్రవాసంలో ఉన్న తండ్రీ కొడుకులు మాత్రం కరోనా భీతితో తలుపులు బిగించుకుని ఇంట్లో దాక్కున్నారు.  అని ఆయన తన ట్విట్టర్ లో ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: