ఏపీలో వైసీపీ నేతల మధ్య విభేదాలు కాస్త తలనొప్పిగా మారాయి అనే చెప్పాలి. ఎక్కడో ఒక చోట ఏదోక ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. కళ్యాణదుర్గం వైసీపీలో తారాస్థాయికి చేరిన విభేదాలు... పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. ఎంపీ తలారి రంగయ్య ఫ్లెక్సీలు కట్టకుండా ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ వర్గీయులు అడ్డుకున్నారు.

ఇరువర్గాలకు చెందిన  కార్యకర్తల మధ్య అర్ధరాత్రి తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. కళ్యాణదుర్గం టీ సర్కిల్ లో ఏర్పాటు చేసిన ఎంపీ రంగయ్య ఫ్లెక్సీలను ఎమ్మెల్యే వర్గీయులు తొలగించారు. ఫ్లెక్సీలు తొలగించకుండా అడ్డుకుంటున్న ఎంపీ వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎమ్మెల్యే వర్గీయుల తీరుతో మనస్తాపం చెందిన ఎంపీ తలారి రంగయ్య అధిష్టానం కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటనకు ఎంపీ రంగయ్య దూరంగా ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: