గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు బయటకు వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారంతో పాటుగా బిజెపి నుంచి కూడా కొందరు బయటకు వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో డీకే అరుణ పార్టీ మారుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆమె స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో తాను చేరుతున్నట్లు  సోషల్  మీడియాలో టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు అని ఆమె మండిపడ్డారు.

బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ మలక్ పెట్ నియోజకవర్గం సైదాబాద్ డివిజన్ బీజేపీ అభ్యర్థి కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. తనతో ఉత్తమ్ మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. రెండు రోజులలో విజయ శాంతి తో పాటు మరి కొందరు కాంగ్రెస్ నాయకులు  బీజేపీలో చేరనున్నారని ఆమె వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: