ఇద్దరు ముఖ్యమంత్రులు కావాలా? ఒక్కరే సీఎంగా ఉండాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పాత బస్తీలో ప్రచారం చేసే దమ్ము సీఎం కేసీఆర్ కు లేదు అన్నారు. పాతబస్తీ నుంచి దేశ ద్రోహులను తరిమికొడతాం  అన్నారు. హైదరాబాద్ మార్పు బీజేపీతోనే సాధ్యం అని ఆయన స్పష్టం చేసారు. గ్రేటర్ ను పాలించే అవకాశం ఒక్క సారి బీజేపీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.

ఇకపై భాగ్యలక్ష్మీ దేవాలయం దగ్గరే మా అడ్డా పెడ్తాం అన్నారు. అభివృద్ధి, రాజకీయంగా హైదరాబాద్ మారాల్సిన అవసరం ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అభివృద్ధిపై టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి అని, డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇస్తామని పేదలను ప్రభుత్వం మోసం చేసింది అని మండిపడ్డారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం నిరుద్యోగులతో ఆడుకుంటోంది అని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ తీరుతో  విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: