గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం కోసం బిజెపి నేతలు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలను ఆకట్టుకోవడానికి గానూ బిజెపి నేతలు సమావేశాలు ఎక్కువగా నిర్వహిస్తూ వస్తున్నారు.  ప్రచారంలో కాస్త దూకుడుగా వెళ్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారంలో కాస్త దూకుడుగానే ఉన్నారు. ఇక తాజాగా బిజెపి మరో కార్యక్రమం నిర్వహించడానికి రెడీ అయింది.

మరికాసేపట్లో సికింద్రాబాద్ లోని మహబూబ్ కాలేజ్ లో  మార్పు కోసం జనం, జనం కోసం బీజేపీ కార్యక్రమం నిర్వహిస్తుంది. మార్పు కోసం సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతుంది. చేంజ్ హైదరాబాద్ వెబ్ సైట్ ప్రారంభం  కూడా చేస్తారు బిజెపి నేతలు. బీజేపీ యవ  జాతీయ అధ్యక్షుడు, కర్ణాటక ఎంపీ తేజస్వీ సూర్య ఈ వెబ్ సైట్ ప్రారంభిస్తారు. బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తదితరులు పాల్గొంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: