సినీనటులకు బల్దియా ఎన్నికల సెగ తగిలే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు. సినీ నటుల మీడియా సమావేశాలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. సాయంత్రం 4.30గంలకు బీజేపీ కార్యాలయంలో మీడియాతో సీవీఎల్.నరసింహారావు, కవిత,  వైభవ్, నటుడు రాజమౌళి, శ్రీనాథ్ తదితరులు మాట్లాడే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇప్పటికే ప్రెస్ మీట్ నిర్వహించిన పోసాని కృష్ణమురళి, డైరెక్టర్ శంకర్ ప్రసంశలు కురిపించారు.

ఇక బిజెపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తున్న నేపధ్యంలో సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. ఇక విమర్శలతో పాటుగా పోసాని ఎక్కువగా ప్రసంశలు కురిపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో తెరాస కు వారు మద్దతు ఇవ్వడంతో మిగిలిన సినీ నటులు ఎలా వ్యవహరిస్తారో అని ఆసక్తి ఉంది. ఇక సినీ పెద్దలు కొందరు నిన్న సిఎం కేసీఆర్ తో సమావేశం అయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: