ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల  నిర్వహణ శాఖ కీలక ప్రకటన చేసింది. భారత వాతావరణ శాఖ (ఐఎండి) సూచనల ప్రకారం నైరుతి మరియు దాని అనుసంధానంగా ఆగ్నేయ  బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. 24 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. మంగళవారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయి.

బుధవారం, గురువారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి  అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం  ఉంది. తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. సముద్రం అలజడిగా ఉంటుంది అన్నారు. మూడురోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు  అని హెచ్చరించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసాము అని చెప్పారు.  రైతాంగం వ్యవసాయ పనులయందు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి  అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: