ఏపీలో వైసీపీ నేతల మధ్య విభేదాలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఒక ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలో నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కళ్యాణదుర్గం లో మంత్రి బొత్స సత్యనారాయణ కు నిరసన సెగ గట్టిగా తగలింది. మంత్రి బొత్స సత్యనారాయణ వాహనానికి అడ్డుపడిన వైసిపి కార్యకర్తలు... ఆయన కొన్ని సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేసారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పార్టీని కాపాడాలంటూ మంత్రికి వినతి పత్రం సమర్పించారు ఎంపీ వర్గీయులు. ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి మహిళా కార్యకర్తలు తీసుకుని వెళ్ళారు. ఎంపీ తలారి రంగయ్య వర్గీయుల నిరసన మధ్య కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన కొనసాగుతుంది. ఇక ఎమ్మెల్యే ఎంపీ మధ్య గత కొంత కాలంగా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: