రేపు శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రానున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను  పరిశిలించిన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, కలేక్టర్ భరత్ గుప్తా అధికారులకు పలు సూచనలు చేసారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఘాట్ రోడ్డులో భధ్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు... పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. కల్వర్టుల వద్ద బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.

రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లను  పూర్తి చేశాం అని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. కోవిడ్ నిభందనలు అనుసరించి రాష్ట్రపతి  పర్యటనకు ఏర్పాట్లు చేశాం అని ఆయన అన్నారు. .రాష్ట్రపతికీ స్వాగతం పలికేందుకు రేపు తిరుపతి రానున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్... రాష్ట్రపతితో పాటు శ్రీవారిని దర్శించుకుంటారు. రాష్ర్టపతి పర్యటనలో 30 నిముషాలు పాటు  సిఎం జగన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: