జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ వెంట ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా వెళ్ళారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకులను కలవనున్న జనసేన అధినేత... హైదరాబాద్ ఎన్నికల గురించి చర్చించే అవకాశం ఉంది.

ఇటీవల ఆయన ఏపీలో పర్యటనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనల సందర్భంగా ఆయన అమరావతి ప్రాంత రైతులతో సమావేశం అయ్యారు. స్వయంగా ఆయన వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అన్ని విధాలుగా జనసేన పార్టీ అండగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ తరుణంలో ఆయన ఢిల్లీ వెళ్ళడంతో అసలు ఎందుకు ఏంటీ అనేది ఆసక్తిగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: