5 జీ వచ్చినా సరే ప్రజల్లో మాత్రం మార్పు అనేది రావడం లేదు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ మూడనమ్మకాలతో బ్రతికే పరిస్థితి వచ్చింది. తాజాగా తెలంగాణాలో ఒక దారుణం జరిగింది. మల్యాల మండలం బల్వంతపూర్ లో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... హైదరాబాద్ అల్వాల్ కు చెందిన సాఫ్టవేర్ ఉద్యోగి పవన్ తన బావమరిది జగన్ 12 రోజుల క్రితం మరణించడంతో భార్యతో కలిసి పరామర్శించడానికి వెళ్ళాడు.

అయితే చేతబడి చేయించాడానే అనుమానంతో పవన్ ని అతని బంధువులు సజీవ దహనం చేసారు. కుటుంబ గొడవల నేపథ్యంలో పవన్ ను గది లో బంధించి బంధువులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. సజీవ దహనంలో ఎంత మంది పాల్గొన్నారు అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: