భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తిరుపతి పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో  తిరుమల పర్యటన లో స్వల్ప మార్పులు చేసారు. ముందుగా తెలిపిన మేరకు 12.50కి దర్శనానికి వెళ్లాల్సిన రాష్ట్రపతి, తాజాగా ఆ సమయం మధ్యాహ్నం 1.05 గం.లకు మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలకు బయలుదేరాల్సిన సమయం, సాయంత్రం 4 గంటలకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సాయంత్రం 3.50కి తిరుగు ప్రయాణం కావాల్సిన సమయం…  సా.4.50 గంటలకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.  వైమానిక దళ ప్రత్యేక విమానంలో మొదట అహ్మదాబాద్ కు వెళ్తారని అధికారులు చెప్పారు. కాని తాజాగా తమిళనాడు రాజధాని చెన్నై కు బయలుదేరి వెళ్లేలా రాష్ట్రపతి పర్యటనలో మార్పులున్నట్టు చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా వెల్లడించారు. రాష్ట్రపతి పర్యటన నేపధ్యంలో జాగ్రత్తగా చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: