ఆంద్రప్రదేశ్ మున్సిపల్ చట్టాలు (రెండవ సవరణ) ఆర్డినెస్ 2020 ను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ రాజపత్రం లో 1955 మున్సిపల్ కార్పోరేషన్ చట్టం, 1965 ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టం,1979 విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ చట్టం, 1981 విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ చట్టం, 1994 ఆంద్రప్రదేశ్ మున్సిపల్ చట్టం లలో పలు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ విడుదల చేసింది.

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో లేనందున ఆర్డినెన్స్ ను జారీ చేస్తూ పలు సవరణలతో జారీ చేసారు. ఆర్డినెన్స్ పై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంతకం చేసారు. ఇక ఇదిలా ఉంటే ఏపీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయంలో అసలు స్పష్టత రావడం లేదు. ఎప్పుడు నిర్వహిస్తారు అనే దానిపై త్వరలోనే ఒక క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఆ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: