గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో బెంగళూర్ ఎంపీ తేజస్వి సూర్య వరుసగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ లో అవినీతి రాజ్యం ఏలుతుంది....అభివృద్ధి కుంటుపడింది అని ఆయన మండిపడ్డారు. కమిషన్లు దండుకొని ఒక కుటుంబం మాత్రం బాగుపడింది అని విమర్శించారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో  నగరం లో చేసిన అభివృద్ధి ఏమి లేదు అన్నారు. కేవలం తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం బాగుపడింది అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

అందరూ కలిసి కుటుంబ పాలనను తరిమి కొట్టాలి అని కోరారు. హైద్రాబాద్ నగరం మాది అంటున్నాడు ఒవైసీ... ఇది ఒవైసీ ది కాదు మన హిందువులదని నిరూపిద్దాం అన్నారు. భాగ్యనరాన్ని పూర్వస్థితి కి తీసుకువద్దాం అని వ్యాఖ్యలు చేసారు. బీజేపీ ని గెలిపించండి... నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం అని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజాలనంత నగరం వైపు చూస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. నగరంలో కూడా బీజేపీ బలపడుతుంది అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: