టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ దురాగతాలకు రోజుకో ముస్లిం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉండటం దారుణం అని ఆయన ఆరోపణలు చేసారు. నంద్యాలలో సలాం కుటుంబ ఆత్మహత్య ఘటన గురించి ఇంకా అందరం బాధలో ఉన్నాం అని... ఈలోపు తాడికొండకు చెందిన ముస్లిం మౌజాం షేక్‌ హనీఫ్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

ముస్లిం శ్మశానవాటికలో వైసీపీ నేతలు మట్టిని తవ్వుకుపోతుంటే ప్రశ్నించడమే తప్పైపోయిందా? అని నిలదీశారు. పది మంది ముందు దాడి చేసి, తిడుతూ అవమానిస్తారా?  అని ప్రశ్నించారు. ఆయన ప్రాణాలు పోయుంటే ఆ కుటుంబానికి జవాబుదారీ ఎవరు? అని నిలదీశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితుల పై చర్య తీసుకోవాలి అని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap