గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు బిజెపి నేతలు కాస్త సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే విజయం సాధించే విధంగా ప్రణాలికలు సిద్దంగా ఉంచుకుని బిజెపి కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా,  కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, పశ్చిమ బెంగాల్ బిజెపి నేతలు, ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్య నాథ్ ప్రచారం చేస్తున్నారు.

రాజకీయంగా ఈ ఎన్నికలు బిజెపికి చాలా కీలకం అయిన నేపధ్యంలో ప్రచారం కోసం చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రచారం చేసుకునే విషయంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలను బిజెపి నేతలు తీసుకు రావడం గమనార్హం. కీలక బిజెపి నేతలు అందరూ కూడా హైదరాబాద్ మీద ఎక్కువగా ఫోకస్ చేసారు. దీనితో సర్వత్రా కూడా ఆసక్తి పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: