ఏపీలో మరో సిబిఐ విచారణకు హైకోర్ట్ ఆదేశించే అవకాశాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. నంద్యాల అబ్దుల్ సలాం కుటుంభ ఆత్మహత్య కేసులో హైకోర్టులో ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఈ కేసులో సిబిఐ విచారణకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ఈ నేపధ్యంలో నేడు వాదనలు జరుగుతున్నాయి.

ఆల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి కాజావలి... అబ్దుల్ సలాం కేసు సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టు లో పిల్ ధాఖలు చేసారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పోలీసులు విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి రావని ఆయన పిటీషన్ లో హైకోర్ట్ దృష్టికి తీసుకుని వెళ్ళారు. దీనిపై హైకోర్ట్ న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: