గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో ఇప్పుడు బిజెపి నేతలు కాస్త దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. కచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమాగా ఉంది. రాష్ట్ర స్థాయి నేతలు, జాతీయ స్థాయి నేతలు వరుసగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా  బిజెపి యువ మోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్య దూకుడుగా వెళ్తున్నారు.

బిజెపి యువ మోర్చా అధ్యక్షుడు   తేజస్వి సూర్య  ఉస్మానియా యూనివర్సిటి దగ్గరకు వెళ్ళారు. హైదరాబాద్‌లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు టోన్ సెట్ చేస్తాయి అని ఆయన వ్యాఖ్యానించారు. మేము దీనిని గెలుస్తామని... మేము తెలంగాణ అసెంబ్లీని గెలుస్తామన్నారు ఆయన. మేము తమిళనాడును కూడా గెలుస్తామన్నారు. మేము కేరళను గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. దక్షిణ భారతదేశం మొత్తం కాషాయ రెపరెపలు ఉంటాయని ఆయన హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: