ఇళ్ళ స్థలాల విషయంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు కాస్త ఘాటుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పేదల సెంటు స్థలం పై వైసీపీ చెప్పినవన్ని అవాస్తవాలే అని టీడీపీ నేత బొండా ఉమా ఆరోపించారు.  టీడీపీ కోర్టుకి వెళ్లి ఉంటే వైసీపీ డిసెంబరు లో పంపిణీ ఎలా చేస్తారు అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ పేదల సెంటు స్థలం పై ఎక్కడ కోర్టు కి వెళ్లిందో ప్రభుత్వం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు.

కోర్టు కేసులు పేరు చెప్పి వైసీపీ తన అసమర్ధతను కప్పి పుచ్చుకుంది అని విమర్శించారు. వైసీపీ చెపుతున్న 1  రూపాయి ఇల్లు పెద్ద బోగస్ అన్నారు. ఈ జన్మకు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. వైసీపీ మ్యానిఫెస్టోలో పెట్టినట్లు టిడ్కో ఇళ్లను, ఎన్టీఆర్ గృహాలను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: