తిరుపతి ఉప ఎన్నికలు ఇప్పుడు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికల విషయంలో ఇప్పుడు రాష్ట్ర అధికార విపక్షాలు కాస్త ఎక్కువగా ఫోకస్ చేసాయి. ప్రచారం చేసుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ కాస్త దూకుడుగా వెళ్తుంది. తిరుపతి ఉప ఎన్నికల అభ్యర్ధులను అధికార విపక్షాలు రాకటించిన సంగతి తెలిసిందే. ఇక తిరుపతి ఉప ఎన్నికలకు సిద్ధమైన తెలుగుదేశం పార్టీ ప్రచారానికి రెడీ అయింది.

నవంబర్ 28న తిరుమలలో దర్శనం చేసుకున్న అనంతరం ఎన్నికల ప్రచారానికి తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి శ్రీకారం చుడతారు అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.  శనివారం నాడు పార్టీ ముఖ్య నేతలతో సమావేశంతో పాటు ఎన్నికల ప్రచారంలో పనబాక లక్ష్మీ పాల్గొననున్నారు. పార్లమెంట్ స్థానంలో విస్తృతంగా పర్యటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ కూడా త్వరలో ప్రచారం చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: