గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు నేతల మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా బండి సంజయ్  ప్రచారం సందర్భంగా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ మేయర్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత పాతబస్తీ మీద స ర్జికల్ స్ట్రైక్ చేస్తాం అని ఆయన హెచ్చరించారు.

రోహింగ్యాలను, పాకిస్తాన్ కొడుకులను తరిమి తరిమి కొడతాం. బీజేపీ బరాబర్ హిందువుల కోసం పోరాడుతుంది అని అన్నారు. దీనిపై కేటిఅర్ స్పందించారు. ఓట్లు, సీట్లు కోసం మైండ్ పోయి మాట్లాడుతున్నారు అని కేటిఅర్ మండిపడ్డారు.  కిషన్ రెడ్డి గారు మీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఒక హోం మంత్రిగా మీరు సమర్ధిస్తారా అని కేటిఅర్ తన ట్విట్టర్ లో నిలదీశారు. ఈ వ్యాఖ్యలు దుమారంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: