గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు బిజెపి నేతల ప్రచారం కాస్త దూకుడుగానే ఉంది. బిజెపి నేతలు కొందరు వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తాజాగా బిజెపి ఎంపీ తేజస్వి సూర్య కీలక వ్యాఖ్యలు చేసారు. ఉస్మానియా యూనివర్సిటీ కేసీఅర్ కుటుంబ జాగీరు కాదని తేజస్వీ సూర్య అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు మంత్రి కేటీఆర్ లెక్కలు చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు.

కేంద్ర నిధులను కేసీఆర్ కుటుంబం దాచుకుంటోంది అన్నారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నాడు అని మండిపడ్డారు. ఓయు ద్వారా ఎదిగిన కేసీఆర్.. విద్యార్థులను అణిచివేయడాన్నిఖండిస్తున్నా అన్నారు. విద్యార్థులకు బీజేవైఎం అండగా ఉంటోంది అన్నారు. కేసీఅర్ పై యుద్ధానికి ఓయూ విద్యార్థులు సిద్ధం కావాలని సూచించారు. గ్రేటర్ లో క్షేత్రస్థాయిలో బీజేపీలో బలపడిందని, జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదే అని ఆయన వ్యాఖ్యలు చేసారు.. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: