ఎమ్మెల్యేలను కూడా  కంట్రోల్ చేయలేని పరిస్థితిలో జగన్మోహన్  రెడ్డి  ఉన్నారు అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. ఎమ్మెల్యేలు మంత్రుల మీద జగన్మోహన్ రెడ్డి కి కంట్రోల్ తప్పుతోంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఒక్కొక్క జిల్లాకు ఒకరికి అప్పగించేశారు.. దోచుకు  తినమని చెప్పేశారు అని ఆయన విమర్శలు చేసారు. జగన్ , విజయ్ సాయి రెడ్డి మనుషులు విశాఖ లో భూములు కొన్నారని ముందే  చెప్పా౦ అన్నారు.

భూముల మీద  కన్నేసి భూములు లాక్కొని ప్రయత్నం మొదలు పెట్టారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ప్రతి శనివారం కూల్చివేతలు కార్యక్రమం పెట్టారు అని విమర్శలు చేసారు. టిడిపి నేతలే కాదు, పేద ప్రజల భూములు కూడా లాక్కుంటున్నారు అని మండిపడ్డారు. ఎయిర్పోర్ట్   ప్రారంభం కాకుండా విశాఖ ఎయిర్పోర్ట్ ఆపివేయాలని  విజయసాయిరెడ్డి లెటర్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: