ఇదే క్రమంలో వరుస రోడ్ షోలు నిర్వహిస్తూ పార్టీ స్టాండ్ ను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అటు ప్రతిపక్షాల కామెంట్లకు కౌంటర్లు ఇస్తూ చేసిన అభివృద్ధిని ప్రజల ముందుంచుతున్నారు కేటిఆర్.ప్రచారంలో భాగంగా అంబర్పేట్ నియోజకవర్గం రోడ్షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఆరేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత మాపై ఉందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ నాయకులకు పరిపాలన రాదని గతంలో హేళన చేసిన వారి నోర్లు మూయించామన్నారు. ఆరేళ్లుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో కొందరు మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. అయినా వారి ఆటలు సాగవు టిఆర్ఎస్ గెలుపును ఎవరు ఆపలేరు అంటూ తనదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు .