గ్రేటర్ ఎన్నికల సమరం రోజురోజుకూ రసవత్తరంగా మారుతుంది.రాజకీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ టి‌ఆర్‌ఎస్ కారు జోరు చూపిస్తుంది. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్షంగా మంత్రి టి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్  ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అభ్యర్థుల విజయానికి బాటలు వేస్తున్నారు.

ఇదే క్రమంలో వరుస రోడ్ షోలు నిర్వహిస్తూ పార్టీ స్టాండ్ ను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అటు ప్రతిపక్షాల కామెంట్లకు కౌంటర్లు ఇస్తూ చేసిన అభివృద్ధిని ప్రజల ముందుంచుతున్నారు కే‌టి‌ఆర్.ప్రచారంలో భాగంగా అంబర్‌పేట్‌ నియోజకవర్గం రోడ్‌షోలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఆరేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత మాపై ఉందని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. 

తెలంగాణ నాయకులకు పరిపాలన రాదని గతంలో హేళన చేసిన వారి నోర్లు మూయించామన్నారు. ఆరేళ్లుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో కొందరు మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. అయినా వారి ఆటలు సాగవు టి‌ఆర్‌ఎస్ గెలుపును ఎవరు ఆపలేరు అంటూ తనదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: