టీడీపీ అనుకూల మీడియా వైసీపీ విషయంలో కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంది అనే వ్యాఖ్యలు మనం వింటూనే ఉంటాం. రాజకీయంగా సిఎం జగన్ ని ఎదుర్కొనే విషయంలో టీడీపీ అనుకూల మీడియా కాస్త కొన్ని కొన్ని అంశాల్లో ఎక్కువగా జగన్ ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. దీని వలన రాజకీయ వర్గాల్లో కూడా కాస్త టీడీపీ అనుకూల మీడియా మీద విమర్శలు వస్తూనే ఉంటాయి.

ఇక ఇదిలా ఉంటే తాజాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేసారు. “ట్రెండ్ సెట్ చెయ్యడం అంటే పచ్చ మీడియాలో పెయిడ్ న్యూస్ ఇచ్చుకోవడం కాదు. అత్యంత ప్రజాదరణ కల్గిన రాజకీయ నేతగా సోషల్ మీడియాలో ప్రధాని తర్వాత ఉన్నారు మన సీఎం వైఎస్ జగన్ గారు. ఆగస్టు- అక్టోబర్ మధ్యలో 2,171 ట్రెండ్స్ మోదీ తొలి స్థానంలో, 2137 ట్రెండ్స్ తో  2వ స్థానంలో ఏపీ సిఎం గారు ఉన్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: