నేడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కీలక మంతనాలు జరుపుతున్నారు.  బీజేపీ అగ్రనాయకత్వంతో కొనసాగుతున్న పవన్ చర్చలు.... ఇంకా కొలిక్కి రాలేదు అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వెనుక అర్ధం ఏంటీ అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఆయన వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక పవన్ కళ్యాణ్ తిరుపతి ఎంపీ సీటు విషయంలో పట్టుబడుతున్నా సరే బిజెపి అధిష్టానం మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల కోసమే జనసేన పార్టీ... గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మరి ఈ విషయంలో ఎలాంటి ముందు అడుగు పడుతుంది ఏంటీ అనేది చూడాలి త్వరలో స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: