అహ్మద్ పటేల్... కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేతల్లో ఆయన కూడా ఒకరు. కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలుగా ఆయన ముందుకు నడిపించారు. ఇందిరా గాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు ఆయన అందరితో సన్నిహితంగా మెలిగారు. సోనియా గాంధీ రాజకీయ సలహాదారుగా ఆయన నిలిచారు. ఇక గుజరాత్ లో సిఎంగా మోడీ ఉన్న సమయంలో ఆయనకు ప్రధాన ప్రత్యర్ధి అహ్మద్ పటేల్ అంటారు.

కాంగ్రెస్ ను గుజరాత్ లో ఆయన సమర్ధవంతంగా నడిపించడమే కాదు... మోడీకి చుక్కలు చూపించారు. అందుకే 2017 లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయనను ఎలా అయినా సరే ఓడించాలి అని బిజెపి అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తే... ఎమ్మెల్యేలను సమర్ధవంతంగా కాపాడుకుని, డీకే శివకుమార్ సహకారంతో రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ఆయన రాజ్యసభలో అడుగు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: