ఏపీలో టీడీపీ కార్యకర్తల విషయంలో పోలీసులు దూకుడుగా ఉన్న సంగతి తెలిసిందే. తమకు అనుకూలంగా లేని వారి మీద వైసీపీ నేతలు కేసులు పెట్టడం వారిని అదుపులోకి తీసుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా మరో కార్యకర్తను అరెస్ట్ చేసారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేసారు.

“పులివెందుల పిల్లి టిడిపి కార్యకర్తలను చూసి భయపడుతుంది.సగం గోడ కట్టి ఎమ్మెల్యే భారీ ప్రారంభోత్సవం చెయ్యడమే సిగ్గుచేటు. గోడ గ్రాండ్ ఓపెనింగ్ ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినందుకు పొన్నూరులో టిడిపి కార్యకర్త మణిరత్నాన్ని పోలీసులు అక్రమ అరెస్టు చెయ్యడం... వైఎస్ జగన్ పిరికితనాన్ని బయటపెట్టింది. మణిరత్నం పెట్టిన పోస్ట్ లో తప్పేంటో అరెస్ట్ చేసిన పోలీసులు చెప్పాలి. వైకాపా నాయకులు ఆడమన్నట్టు ఆడుతున్న కొంతమంది పోలీసులు ఇలాంటి అక్రమ అరెస్టులతో సాధించేది ఏమి ఉండదు ప్రతిగా కష్టాలు కొనితెచ్చుకోవడం తప్ప. అని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: