రేపు బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని బిజెపి సీనియర్ నేత లక్ష్మణ్ అన్నారు.  గురువారం 12 గంటలకు బీజేపీ మ్యానిఫెస్టోను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విడుదల చేస్తారని లక్ష్మణ్ వెల్లడించారు. గ్రేటర్ లో ఎన్నికల ప్రచారంను కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్  నిర్వహిస్తారని చెప్పారు.

ఈనెల 27న సిఎం యోగీ ఆదిత్యానాత్ హైదరాబాదు, చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో ప్రచారం చేస్తారని ఆయన వెల్లడించారు. 28న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా మేథావులతో సమావేశం నిర్వహిస్తారని ఆ తర్వాత  మల్కాజ్‌గిరి పార్లమెంటులో ప్రచారం చేస్తారని ఆయన పేర్కొన్నారు. 29న అమిత్ షా సికింద్రాబాద్ పార్లమెంటు లో ప్రచారం నిర్వహిస్తారు అని ఆయన అన్నారు. ఇప్పటికే ముగ్గురు కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: