గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు తెరాస పార్టీ ప్రచారం చేసే విషయంలో చాలా వరకు కూడా దూకుడుగానే ఉంది. అయితే సిఎం కేసీఆర్ ప్రచారం చేసే విషయంలో ఎలాంటి ముందు అడుగు కూడా ఇంకా పడలేదు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే సిఎం కేసీఆర్ రేపు సాయంత్రం నుంచి ప్రచారం చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆయన ప్రచారం చేస్తారు.

ఆయనతో పాటుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా మరో ముగ్గురు నేతలు ఉండే అవకాశం ఉంది. చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆయన ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. మరి ఇది నిజమా కాదా అనేది చూడాలి. రేపు సాయంత్రం ఆయన రోడ్ షో నిర్వహించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. త్వరలో స్పష్టత వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: