గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో తెరాస పార్టీ నేతలు కొంత మంది బిజెపి నేతలను తమ పార్టీలోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఇద్దరు బిజెపి నేతలకు వాళ్ళు గాలం వేసారని సమాచారం. సనత్ నగర్ నియోజకవర్గంలో  కీలక నేతలు ఇద్దర్ని పార్టీలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారితో చర్చలు జరిపారు.

వారు రెండు రోజుల్లో పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. దీనికి సంబంధించి నేడు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వారు పార్టీ మారే అంశం గురించి సమాచారం అందుకున్న బిజెపి రాష్ట్ర నాయకత్వం వారు వెళ్ళకుండా ఉండాలని ఎన్నికలు అయిన తర్వాత వారికి మంచి అవకాశాలు ఇస్తామని సూచనలు హామీలు ఇస్తున్నారు. మరి వారు ఉంటారా తెరాస లోకి వెళ్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: