ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల  నిర్వహణ శాఖ నివర్ తుఫాన్ పై స్పందించింది. తీరం దాటింది అని విపత్తుల శాఖ కమీషనర్ వెల్లడించారు. తమిళనాడు - పుదుచ్చేరి మధ్య, పుదుచ్చేరి దగ్గర లో బుధవారం రాత్రి 11:30 నంచి ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల మధ్య తీరం దాటింది అన్నారు. అతి తీవ్ర తుపాను తీవ్ర తుపానుగా బలహీన పడింది అన్నారు. తీరం దాటినా సరే ఇది ప్రభావం చూపిస్తుంది అన్నారు.

తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ రోజు చిత్తూరు , కర్నూలు ,ప్రకాశం , వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు  పడే అవకాశం ఉంది అని, మిగిలిన చోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు పడుతున్నాయని, ప్రభావిత ప్రాంత  ప్రజలు  తప్పనిసరిగా వీలైనంత  వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి అని సూచించారు. ఇల్లు సురక్షితం కాకపోతే పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: