గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారంలో ఇప్పుడు నేతలు దూసుకుపోతున్నారు. ప్రచారం చాలా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో... తెరాస అభ్యర్ధికి షాక్ తగిలింది. మూసాపేట డివిజన్ టిఆర్ఎస్  పార్టీ అభ్యర్థి అయిన శ్రవణ్ గౌడ్ కు చెందిన ఎలాంటి  అనుమతి లేకుండా నడుస్తున్న డిజిటల్ ప్రచార రథాన్ని సనత్ నగర్ పోలీసులు సీజ్ చేసారు. కేవలం ప్రచార రథం పేరుతో అనుమతి తీసుకున్నారు.

డిజిటల్ ప్రచార రథానికి అనుమతి తీసుకోకపోవడంతో ఎం హెచ్ 10  బీఆర్ 0451 వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. రాజకీయ పార్టీ నాయకులు తప్పనిసరిగా ఏ ప్రచారానికి అయిన అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని లేని పక్షంలో ప్రజా రథాలను సీజ్ చేస్తామని పోలీస్ అధికారులు రాజకీయ పార్టీ నాయకులకు స్పష్టమైన హెచ్చరికలు చేసారు. గ్రేటర్ ఎన్నికలు వచ్చే నెల 1 న జరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: