హైద్రాబాద్ సీపీ అంజనీ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి కానీ  హైద్రాబాద్ నగరం , ప్రజలు శాశ్వతం గా ఉంటారు అని ఆయన అన్నారు. ఎలక్షన్స్ కు చాలా మంది వస్తున్నారు  అని ఆయన వ్యాఖ్యానించారు. హైద్రాబాద్ లో ఎదో జరుగబోతోంది అన్న ప్రచారం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారు  అన్నారు.

నగర ప్రజలు  సోషల్ మీడియా లో జరిగే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు అని సూచించారు. మత ఘర్షణలు , లా అండ్ ఆర్డర్ డిస్ట్రబ్ చేసే వాళ్లపై పీడీ యాక్ట్ లు పెడతామని సీపీ అంజనీ హెచ్చరికలు చేసారు. నగరంలో ఎలాంటి ఘటనలు జరిగినా భారీ మూల్యం తప్పదు అని సోషల్ మీడియా లో జరుగుతున్న అసత్య ప్రచారకులకు సీపీ వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: