గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ఎక్కువగా జరుగుతుంది. బిజెపి, మజ్లీస్ పార్టీల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక తాజాగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్రం... కిషన్ రెడ్డి లాంటి ఫెయిల్యూర్ మంత్రిని బర్తరఫ్ చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. పాతబస్తీలో పాకిస్థానీయులు రోహింగ్యాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ఆయన నిలదీశారు.
 
హోం సహాయ మంత్రి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు అని ఆయన ప్రశ్నించారు. నరేంద్ర మోదీ  కిషన్ రెడ్డి లాంటి  ఫెయిల్యూర్ మంత్రిని ని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. ఇక కిషన్ రెడ్డి కూడా ఆయనపై ఘాటుగానే స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: