గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో బిజెపి నేతలు కాస్త దూకుడుగా వెళ్తున్నారు. ప్రచారంలో దాదాపుగా నేతలు అందరూ కూడా పాల్గొంటున్నారు. నాచారం డివిజన్ అభివృద్ధికై బిజెపి కార్పొరేటర్ అభ్యర్థి అంపాల అనిత పద్మా రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు. ఆయన హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారం చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాచారం లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేసారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మండిపడ్డారు. వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్ధించారు. రాజకీయాలు చూడవద్దు అని, ప్రజలు అందరూ కూడా ఆలోచించి ఓటు వేయాలని ఆయన సూచనలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: