లా అండ్ ఆర్డర్ సమస్యలపై తెలంగాణా సిఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనం అయ్యాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. శాంతి భద్రతలకు విఘాతం ఎవరు కల్పిస్తున్నారో ముఖ్యమంత్రే బయటపెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేసారు. లా అండ్ ఆర్డర్ సమస్యలుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం‌ లేదు?  అని నిలదీశారు.

ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే.. కేంద్రం రోహింగ్యాలను వెనక్కి పంపిస్తుంది అన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారన్న సమాచారం మాకుంది అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలను వదిలేసి కేటీఆర్ జాతీయ అంశాలను మాట్లాడటం చేతకాని తనం అని ఎద్దేవా చేసారు. మహానాయకులు ఎన్టీఆర్, పీవీ లను బీజేపీ గౌరవిస్తోంది అన్నారు. తేజస్వీ సూర్యపై ఓయూ పోలీసులు  కేసు నమోదు చేయటాన్ని ఖండిస్తున్నానని ఆయన వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: