బిజెపి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం కోసం కాస్త ఎక్కువగానే కష్టపడుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా వ్యాఖ్యలు చేసారు. కవాడీగూడలో బండి సంజయ్ ప్రచారం చేసారు. కార్పొరేట్ ఆసుపత్రులతో  కుమ్మక్కయ్యారు కాబట్టే.. కేసీఆర్ కు  వాక్సిన్ రావటం ఇష్టంలేదు అని ఆయన ఆరోపించారు.

కూతవేటు దూరంలో ఉన్న భారత్ బయో టెక్ కు ఇప్పటి వరకు సీఎం ఎందుకు పోలేదు? అని ఆయన ప్రశ్నించారు. వరదలు వచ్చినప్పుడు ఫార్మ్ హౌస్ నుంచి బయటకు రాని సీఎంకు.. ప్రధాని ఎందుకు రాలేదని ప్రశ్నించే హక్కు లేదు అని ఆయన స్పష్టం చేసారు. వాక్సిన్ కోసం కృషి చేస్తోంటే.. టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోంది అని ఆయన విమర్శలు చేసారు. నేడు ప్రధాని వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: